నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్గా మారి ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ అనే కార్యక్రమం చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇందులో అనేక ప్రశ్నలు అభిమానులని ఆశ్చర్యంలోకి నెట్టాయి. ముఖ్యంగా తేదేపా పగ్గాలు ఎందుకు తీసుకోలేదు అని మోహన్ బాబు ప్రశ్నకు బాలయ్య ఆశ్చర్యపోయే రియాక్షన్ ఇచ్చాడు.ఆయన ఏం సమాధానం ఇచ్చాడు అని అందరిలో ఆసక్తి ఉండగా, తాజా ఎపిసోడ్తో క్లారిటీ వచ్చింది.
బాలకృష్ణ చేసిన తొలి ఇంటర్వ్యూ ఇవాళ ఉదయం టెలికాస్ట్ అయింది. మొదటి ఇంటర్వ్యూలో డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో సందడి చేశారు బాలయ్య. ఇందులో మోహన్ బాబు.. బాలకృష్ణని ఎన్టీఆర్ తర్వాత మీరెందుకు టీడీపీ పగ్గాలు చేపట్టలేదు, చంద్రబాబుకి ఎందుకు ఇచ్చేశారు అని అడిగారు. ముందు సీరియస్ అయినట్టు కనిపించినా బాలకృష్ణ తర్వాత సమాధానం చెప్పారు. అప్పట్లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అంటూ ఇలా వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా టీడీపీ పోరాటం చేసింది. నాన్న గారు కూడా వారసత్వ రాజకీయాలకి వ్యతిరేకం. ఆ సమయంలో వంశపారంపర్య రాజకీయాలు మనమే చేస్తే బాగుండదు.
పార్టీ అనేది ప్రజల కోసం నిలబడాలి. అందుకే నేను టీడీపీ పగ్గాలు తీసుకోలేదు అని అన్నారు. ఇక చంద్రబాబు గురించి చెప్తూ చంద్రబాబు కూడా పంచాయతీ స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తి, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని బాలకృష్ణ అన్నారు.