ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న సినిమా ‘బలమెవ్వడు’. పృథ్వీరాజ్, సహాసినీ, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సనాతన దృశ్యాలు పతాకంపై ఆర్బీ మార్కండేయులు నిర్మిస్తున్నారు. సత్య రాచకొండ దర్శకుడు. మెడికల్ మాఫియా నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతున్నది. అక్టోబర్ 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్య రాచకొండ మాట్లాడుతూ…‘కొన్ని నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మెడికల్ మాఫియా సామాన్య ప్రజల్ని ఎలా ఇబ్బందులు పెడుతున్నదో చూపిస్తున్నాం. ఈ సమస్యను ఎలా ఎదుర్కొవాలి అనే అంశాన్నీ చెబుతున్నాం. మణిశర్మ సంగీతం ఆకర్షణగా నిలుస్తుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు.