Veera Simha Reddy Movie Release date Announced | ‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత ‘వీర సింహా రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘క్రాక్’ ఫేం గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. క్రాక్ వంటి భారీ విజయం తర్వాత గోపిచంద్ మలినేని, బాలయ్యతో సినిమా చేయనుండటంతో అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించింది.
ఈ చిత్రాన్ని ముందుగా డిసెంబర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు గతంలోనే వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ సినిమాకు పోటీగా వాల్తేరు వీరయ్య, వారసుడు రిలీజ్ కానున్నాయి. మైత్రీ మూవీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ నటిస్తుంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం. ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే నిర్మాతలకు రూ.140 కోట్ల వరకు వచ్చాయని టాక్.
కాగా ఈ సినిమాకు పోటీగా రిలీజవుతున్న వాల్తేరు వీరయ్య సినిమాను కూడా మైత్రీ సంస్థనే నిర్మిస్తుంది. ఇన్నేళ్ళ సినీ ఇండస్ట్రీలో మొట్ట మొదటి సారిగా ఒకే బ్యానర్లో తెరకెక్కిన సినిమాలు ఒకటి, రెండు రోజుల గ్యాప్లో రిలీజవడం ఇదే మొదటి సారి. మరీ మైత్రీకి ఈ రెండు సినిమాలు కలిసి వస్తాయో లేదో చూడాలి.