‘మా’ ఎన్నికల (Maa Elections) పోలింగ్ ముగిసింది. 75 శాతం పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సారి ప్రధానంగా ప్రకాశ్ రాజ్ (Prakash Raj), మంచు విష్ణు (Manchu Vishnu) గట్టి పోటీ నెలకొంది. గెలుపుపై రెండు ప్యానెళ్లు చాలా ధీమాగా ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో ఉన్న మా మెంబర్స్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, జెనీలియా, జయప్రద, మోహన్ బాబు, నాగబాబుతోపాటు మిగిలిన సభ్యులు ఓటు వేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ (Balakrishna) మాట్లాడుతూ..మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా నా ఓటు వినియోగించుకునేందుకు ఇక్కడికొచ్చాను. కళాకారులు, ఇండస్ట్రీకి ఎవరు బాగా సేవ చేస్తారో..వారికి నేను ఓటేయడం జరిగింది. రెండు ప్యానెళ్ల వాళ్లు ఇండస్ట్రీకి మంచి పనులు చేసేలా కనిపిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఇండస్ట్రీకి ఇద్దరు అన్నదమ్ముల్లాంటివారే. ఇద్దరూ మాటలు చెప్పడమే కాదు..చేసి చూపించగలిగేవాళ్లు. రేపు మళ్లీ అంతా షూటింగ్స్ లో కలుకునేవాళ్లమే. అందరం కలిసికట్టుగా పని చేసుకునేవాళ్లమే. ఎవరు గెలిచినా సరే వెనకుండి వారిని నడిపిస్తాం..ప్రోత్సహిస్తాం. సహనటీనటులందరికీ కూడా న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
జెనీలియా (Genelia D’Souza) :
ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉందని నటి జెనీలియా చెప్పింది. తెలుగు ఇండస్ట్రీ నాకు ఎప్పటికీ ఇళ్లు లాంటిది. ఇక్కడికి వచ్చి ఓటేయడం ఆనందంగా ఉంది. మంచి వ్యక్తి ఎన్నికల్లో గెలుస్తారు..త్వరలోనే మా కు సూపర్ ప్రెసిడెంట్ వస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పింది.
నాగబాబు (Nagendra Babu) :
‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ అండ్ ప్యానెల్ కు నేను ఓటేశాను, ప్రజాస్వామ్యానికి ఓటేశానని నాగబాబు అన్నారు. ఎన్నికలు చాలా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని నటుడు సత్యం రాజేశ్ అన్నారు. రెండు ప్యానెళ్లు పోటాపోటీగా ఉన్నాయి..కాబట్టి సాయంకాలం దాకా వెయిట్ చేయాలి. లోపల అందరూ బాగానే మాట్లాడుకుంటున్నారు. బయట కొందరు అనుకుంటున్నట్టు ఎలాంటి గొడవలు లేవన్నారు.
ఇవి కూడా చదవండి..
మా ఎన్నికల్లో గొడవలపై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు.. గొడవలు ఆగాలంటే..
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు
Vijay Devarakonda: తిరుమలలో ఫ్యామిలీతో ప్రత్యక్షం అయిన విజయ్ దేవరకొండ