Chiranjeevi-Balakrishna Movies | చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోరు సిద్ధమైంది. ఒకరు ‘వాల్తేరు వీరయ్య’ అంటూ తలపడటానికి వస్తుంటే.. మరొకరు ‘వీర సింహా రెడ్డి’ అంటూ వస్తున్నారు. ఎప్పుడూ ఉండే పోటీనే అయినా.. ఈ సారి ఎందుకో పోటీ రసవత్తరంగా సాగుతుంది. హీరోల గురించి అటుంచితే, అభిమాలు మాత్రం సై అంటే సై అనే విధంగా ఉన్నారు. ఇప్పటికే చిరు, బాలయ్య ఎన్నో సార్లు తలపడ్డారు. అందులో కొన్ని సార్లు బాలయ్య గెలిస్తే, మరికొన్ని సార్లు చిరు గెలిచాడు. ఇక ఇప్పుడు సంక్రాంతి విన్నర్ ఎవరతారు అని అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇందులో మరో విశేషం ఏంటంటే రెండు సినిమాలనే మైత్రీ సంస్థే నిర్మించింది.
ఇక వీర సింహా రెడ్డి సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. పైగా వీరిద్ధరూ అఖండ, క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత రాబోతుండటంతో ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక చిరు కూడా గాడ్ఫాదర్ వంటి హిట్ తర్వాత రానుండటంతో వాల్తేరు వీరయ్య సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు రవితేజ కీలకపాత్ర పోషించడంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.
ఈ రెండు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చిన అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన సెన్సార్ పనులు పూర్తయినట్లు తెలుస్తుంది. కాగా వీరసింహా రెడ్డి సినిమా 2 గంటల 43 నిమిషాలు ఉండగా.. వాల్తేరు వీరయ్య 2 గంటల 30 నిమిషాలు రన్టైమ్తో థియేటర్లో రిలీజ్ కానుంది. నిడివి విషయంలో బాలయ్యదే పై చేయి ఉంది. కాగా బాలయ్య సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుండగా.. చిరు ఒక రోజు లేటుగా వస్తున్నాడు. కాగా ఈ రెండు సినిమాల్లో శృతిహాసన్ హీరోయిన్గా నటించడం గమనార్హం.