Balagam Venu | జబర్దస్త్ షోతోపాటు సినిమాలతో కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు యెల్దండి (Venu Yeldandi). ఈ టాలెంటెడ్ కమెడియన్ ‘బలగం’ సినిమాతో డైరెక్టర్గా మారాడని తెలిసిందే. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలంగాణలోని కుటుంబ మూలాలు, భావోద్వేగాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ప్రియదర్శి (Priyadarshi), కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించగా.. వేణు ఎల్దండి, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచనా రవి కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఈ సినిమాపై వేణు యెల్దండి తాజాగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
వేణు తన తండ్రి 24వ వర్థంతి సందర్భంగా ఆయనను గుర్తుచేసుకుంటూ నా ‘బలగం’ సినిమా అందరూ చూశారు.. మా నాన్న తప్పా మిస్ యూ నాయిన అంటూ వేణు ఎమోషనల్ అయ్యాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక వేణు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం టాలీవుడ్ హీరో నానితో సినిమా చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Naa BALAGAM Cinema andaru choosaaru..
Maa nanna tappa🥲MISS YOU NAAINA🙏
Late 06/02/2000#father pic.twitter.com/U831rWKRgS
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) February 8, 2024