టాలీవుడ్ ప్రముఖ నటుడు బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా అఖండ. మాస్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా. నవంబర్ 27 న అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సెలెబ్రేట్ చేసింది. హైదరాబాద్ శిల్ప కళా వేదికలో అఖండ ఈవెంట్ ని భారీగానే ప్లాన్ చేశారు. బాలయ్య అభిమానులతో సందడిగా సాగింది. ఇక దర్శకధీరుడు రాజమౌళి, యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు స్పెషల్ గెస్టులుగా వచ్చారు.
ఈ వేదికపై బాలకృష్ణ మాట్లాడుతూ ఆయన ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా ఆ శివపార్వతుల ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లుగా తెలిపారు. అలాగే ఆయన మాట్లాడే ప్రతి మాట వెనుక ఓ పవర్ ఉంటుందని అన్నారు. నవరసల్లానే పూజలతో పాటు మన పూజా విధానాలు తొమ్మిది రకాలుగా ఉంటాయని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో తనపై తానే జోక్ విసురుకున్నారు. ప్రస్తుతం ఆహా ఓటీటీలో షో చేస్తున్నానని, ఇదే విధంగా భవిష్యత్తులో ఓ భక్తి చానల్లో ప్రవచనాల తరహాలో ఓ షో చేస్తానని చమత్కరించారు.తన అఖండ చిత్రాన్ని మాత్రమే కాకుండా అల్లు అర్జున్ నటించిన పుష్ప, చిరంజీవి నటించిన ఆచార్య, రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కూడా ఆదరించాలని బాలయ్య తెలుగు రాష్ట్రాల ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక అఖండ సినిమా వచ్చే నెల 2 వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంది.