నందమూరి నటసింహం బాలకృష్ణ ఫుల్ జోష్లో ఉన్నాడు. వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే అఖండ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి త్వరలో రిలీజ్ చేయబోతున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా నిలవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక క్రాక్ సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా జరిగిపోయింది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలకృష్ణ ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
కొద్ది రోజులుగా బాలకృష్ణ 109వ సినిమాకు సంబంధించిన పలు వార్తలు వస్తున్నాయి. తెలుగులో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలకృష్ణ తన 109వ సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బేనర్లో నిర్మించనుండగా, ఇందులో మోహన్ బాబు విలన్గా నటించనున్నట్టు సమాచారం.