బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. డార్లింగ్ నుంచి సినిమా కోసం ఇప్పుడు టాలీవుడ్నే కాదు దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా గడిపేస్తున్నాడు. వీటిల్లో రాధే శ్యామ్ ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి పెద్దగా అప్డేట్స్ ఏమీ ఇవ్వలేదు. మధ్యలో రెండు మూడు పోస్టర్లు, టీజర్ వదిలారు అంతే. ఆ తర్వాత కూడా అప్డేట్ కోసం చాలా సమయమే తీసుకున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ సినిమాకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పాడు.
‘ రాధే శ్యామ్ చివరి షెడ్యూల్ పూర్తయింది !! త్వరలోనే డార్లింగ్ ఫ్యాన్స్కు నా ప్రేమను వ్యాప్తి చేస్తా !! ఈ మహమ్మారి మన ఊహాలను నిరాశపరిచింది !! త్వరలోనే అప్డేట్ అందిస్తా’ అని రాధాకృష్ణ కుమార్ ఒక ట్వీట్ చేశాడు. మూడు రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందంటూ మరో ట్వీట్ చేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మరో మూడు రోజుల్లో అప్డేట్ ఉంటుందని డైరెక్టర్ ట్వీట్ చేయడంతో.. ఆ రోజు మూవీ పోస్టర్ లేదా టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని.. సినిమా రిలీజ్ డేట్ కూడా అందులోనే ప్రకటించే అవకాశం ఉందని ప్రభాస్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. 2022 సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. భాగ్యశ్రీ, నచిన్ కేడ్కర్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు
రెండో పెళ్లికి సిద్ధమైన అక్కినేని మనుమడు.. నెట్టింట పెళ్లి కార్డు వైరల్
చిరంజీవి బ్లాక్ బస్టర్ రీమేక్లో పవన్ కళ్యాణ్