Prabhas business entry | ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి వరుస ఫ్లాప్లు వచ్చిన ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ను అందుకుంటున్న హీరోలలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈయన ఒక్కో సినిమాకు రూ.120 కోట్ల వరకు తీసుకుంటున్నాడని టాక్. నిర్మాతలు కూడా ఈ స్థాయిలో పారితోషికాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. ఎందుకంటే ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ వస్తే చాలు వెయ్యి కోట్లు రాబట్టచ్చు అని నమ్ముతున్నారు. సాహోతో అది రుజువైంది కూడా. ఫ్లాప్ టాక్తోనే ఈ సినిమా రూ.450 కోట్లు రాబట్టింది. అంటే ప్రభాస్ స్థాయి ఏ రేంజ్లో ఉందో తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు సినిమాలతోనే సంపాదిస్తున్న ప్రభాస్.. ఇప్పుడు కొత్తగా బిజినెస్ కూడా మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్ అరడజను సినిమాలకు సైన్ చేశాడు. అంటే ఈ సినిమాల కోసం ప్రభాస్ రూ.600 కోట్లకు పైగానే పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులతోనే ప్రభాస్ బిజినెస్ మొదలుపెట్టబోతున్నట్లు టాక్. త్వరలోనే ప్రభాస్ హోటల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో మరో విశేషమేంటంటే.. కేవలం ఇండియాలోనే కాకుండా స్పెయిన్, దుబాయి వంటి దేశాల్లో కూడా ప్రభాస్ హోటల్స్ను ఓపెన్ చేయబోతున్నాడు. ఇలా ఒకవైపు సినిమాలు.. మరో వైపు బిజినెస్లతో రెండు చేతులా సంపాదించడానికి సిద్దమవుతున్నాడు. దీనికి సంబంధించి ప్రభాస్ టీం ఇప్పటికే పనులు మొదలుపెట్టిందట. దీనిపై త్వరలోనే ప్రభాస్ అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతానికి కమిట్ అయిన సినిమాలను ప్రభాస్ షరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-K చిత్రాలు షూటింగ్లతో ప్రభాస్ బిజీగా గడిపేస్తున్నాడు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా మొదలుపెట్టనున్నాడు.