Jithender Reddy | విరించి వర్మ (Virinchi Varma) సినిమాలంటే ఎంత క్లీన్గా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి వచ్చిన ఉయ్యాలా జంపాలా, మజ్ను బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్నాయి. విరించి వర్మ డేండ్ల విరామం తర్వాత పొలిటికల్ డ్రామా జితేందర్ రెడ్డి (Jithender Reddy) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఇటీవలే డైరెక్టర్ దేవాకట్టా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
తన వద్దకు వచ్చిన జనాల సమస్యలపై జితేందర్ రెడ్డి ఆరా తీస్తున్నట్టుగా ఉన్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. అయితే ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తోంది ఎవరనే దానిపై మాత్రం సస్పెన్స్లో పెట్టేశాడు డైరెక్టర్. తాజాగా దీనికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తాజా టాక్ ప్రకారం జితేందర్రెడ్డిగా బాహుబలి, మిర్చి సినిమాల్లో నటించిన రాకేశ్ వర్రె (Rakesh Varre) కనిపించబోతున్నాడట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతున్నట్టు సమాచారం.
ఈ చిత్రాన్నిముడుగంటి క్రియేషన్స్ బ్యానర్పై రవిందర్ నిర్మిస్తున్నారు. వీఎస్ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్ కాగా.. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది.
జితేందర్ రెడ్డి (Jithender Reddy) ఫస్ట్ లుక్..
Looks very exciting and looking forward to see this story!! Wishing all the very best to “Uyyala Jampala” & “Majnu” fame @virinchivarma on his next #JithenderReddy All the very best to our “Baba” @gnanashekarvs @ravinderReddyIN@Muduganti_Offl @GopiSundarOffl 🤗🤗🤗
More details… pic.twitter.com/KlMYgCyryB— deva katta (@devakatta) September 9, 2023