Allari Naresh | ‘ఈ సంవత్సరం ‘బచ్చలమల్లి’ సినిమా సక్సెస్తో ఎండ్ అవుతుందనుకుంటున్నా. సినిమా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు సుబ్బు తాను చెప్పింది తెరపై తీసుకొచ్చాడు. ఈ సినిమాను ఏ స్థాయిలో ఆదరిస్తారో అనే విషయం ప్రేక్షకుల చేతిలో ఉంది. ఒక్కటి మాత్రం పక్కా..ఈ క్రిస్మస్ మనదే’ అన్నారు అల్లరి నరేష్. ఆయన కథానాయకుడిగా సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన ‘బచ్చలమల్లి’ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తున్నది. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. దీనికి కిరణ్ అబ్బవరం, సంయుక్త మీనన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. హాస్య మూవీస్ను తన హోమ్ బ్యానర్లా ఫీలవుతానని, నిర్మాత రాజేష్ దండా అన్కాంప్రమైజ్డ్గా సినిమా తీశారని చెప్పారు. ‘బచ్చలమల్లి’ క్యారెక్టర్ను నరేష్ మాత్రమే చేయగలరని, అంతలా ఆ పాత్రలో ఇన్వాల్వ్ అయ్యారని, ప్రేక్షకులు ఓ గొప్ప సినిమా చూసిన అనుభూతికి లోనవుతారని దర్శకుడు సుబ్బు మంగాదేవి పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను పోషించిన కావేరి పాత్రను అందరూ ఇష్టపడతారని కథానాయిక అమృత అయ్యర్ చెప్పింది. నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ ‘దర్శకుడు సుబ్బు చెప్పిన ఈ కథకు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యాను. సింగిల్ సిట్టింగ్లో నరేష్ కథను ఓకే చేశారు. ఆయన సినిమాలన్నీ ఒకెత్తు అయితే ‘బచ్చలమల్లి మరో ఎత్తు. ఈ సినిమాతో నరేష్ పేరు మోత మోగిపోద్ది’ అన్నారు.