Baahubali Makers | ఎస్ఎస్ రాజమౌళి-ప్రభాస్-రానా కాంబోలో వచ్చిన బాహుబలి ప్రాంఛైజీ ప్రాజెక్ట్ గ్లోబల్ బాక్సాఫీస్ను ఏ రేంజ్లో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 కలెక్షన్ల సునామి సృష్టించాయి. తాజాగా ఈ ఇద్దరూ ఎస్ కార్తికేయతో కలిసి కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil)తో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిలో ఒక చిత్రానికి Don’t Trouble The Trouble టైటిల్ను ఫైనల్ చేశారు.
డెబ్యూ డైరెక్టర్ శశాంక్ యేలేటి రైటర్ కమ్ డైరెక్టర్గా వ్యహరిస్తున్నాడు. పోలీస్ వాహనంపై కూతురితో కలిసి ఛేజింగ్ సీక్వెన్స్లో ఉన్నట్టుగా ఉన్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. మరో చిత్రానికి ఆక్సిజన్ పేరు పెట్టారు. ఈ చిత్రానికి సిద్దార్థ్ నాదెళ్ల రైటర్ కమ్ డైరెక్టర్. ముఖానికి మాస్క్ కనిపిస్తుండగా.. ఫేస్పై ఇండియా మ్యాప్ను చూడొచ్చు. ఈ స్టిల్ చూస్తుంటే ఫహద్ ఫాసిల్ ఫాన్ ఇండియా మార్కెట్ను లక్ష్యంగా చేసుకొని తాజా సినిమాలు చేస్తున్నట్టు అర్థమవుతోంది.
మేము ఈ రెండు అద్భుతమైన సినిమాలను ప్రకటించినప్పుడు నా మదిలో చాలా ఆలోచనలు వచ్చాయి. మల్టీ టాలెంటెడ్ ఫహద్ ఫాసిల్ లాంటి యాక్టర్తో కలిసి పనిచేయడం మాకు చాలా ఉత్తేజకరమైనది. ఈ రెండు సినిమాలతో ఇద్దరు ప్రతిభావంతులైన దర్శకులు శశాంక్, సిద్ధార్థని పరిచయం చేస్తున్నాం.. అంటూ శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. ఈ రెండు సినిమాలను ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తుండటం విశేషం. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో 2025లో విడుదల కానున్నాయి.
So many thoughts come to my mind as we announce these two amazing films! Firstly, working with the versatile and brilliant Fahadh Faasil, is super exciting for us and that too on two projects is simply amazing!
Second, we are introducing two talented directors Shashank &… pic.twitter.com/CtdfMG5Cco
— Shobu Yarlagadda (@Shobu_) March 19, 2024