Ayodhya Ram Mandhir | అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో అంటే ఈ నెల 22న అంగరంగ వైభవంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. భక్తీగీతాలు, భజన పాటలు, శ్రీరామ కీర్తనలతో అయోధ్య రామాలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. అయితే ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు.. పారిశ్రామిక వేత్తలకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఇక సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలను కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఈ సినీ సెలబ్రిటీలలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ అయోధ్యలో జరిగే వేడుకలో పాల్గొననున్నారు. ముంబై నుండి ఆయన ఒక ప్రైవేట్ విమానంలో అయోధ్యకు రానున్నారు.
ఇక టాలీవుడ్కు చెందిన సినీ ప్రముఖులలో మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రాజమౌళి, మోహన్ బాబు అలాగే కోలీవుడ్ నుంచి రజినీకాంత్, ధనుష్, మలయాళం నుంచి మోహన్ లాల్, సురేష్ గోపి, కన్నడ నుంచి రిషబ్ శెట్టి, శివరాజ్ కుమార్, కిచ్చా సుదీప్, దర్షన్ తదితరులు అయోధ్య వేడుకకు ఆహ్వానం అందుకున్నారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలలో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, సన్నీ డియోల్, మాధురి దీక్షిత్, హేమమాలిని, అలియా భట్, కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్ తదితరులు ఆహ్వానం అందుకున్నారు. ఇంకా వీరే కాకుండా శంకర్ మహదేవన్, ఇళయరాజా, సరోద్ వాద్యకారుడు అంజాద్ అలీ, సంజయ్ లీలా బన్సాలి, చంద్రశేఖర్ ద్వివేది తదితరులు ఉన్నారు. అయితే వీరిలో ఎంత మంది ఈ వేడుకకు హాజరవుతారనే దానిపై స్పష్టత లేదు. ఇక ఈ జాబితాలోని కొందరు సెలబ్రిటీలు జనవరి 22న ప్రైవేట్ జెట్లలో అయోధ్యకు రానున్నారు.