ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన ‘అవతార్-2’ గతేడాది డిసెంబర్లో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించింది. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. మొదటి భాగంలో పండోరా గ్రహంలోకి తీసుకెళ్లిన జేమ్స్ కామెరూన్.. ఈ సారి సముద్ర గర్భంలోకి తీసుకెళ్లాడు. విజువల్స్తో మాయ చేశాడు. సినిమా రిలీజై నెల రోజులు దాటిన ఇంకా కొన్ని చోట్ల అవతార్ హవానే కొనసాగుతుంది. ఇతర దేశాల సంగతి అటుంచితే ఇండియాలోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. తాజాగా అవతార్-2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అరుదైన రికార్డు క్రియేట్ చేసింది.
అవతార్ 2 మూవీ ఇప్పటివరకు ఏకంగా రూ.368.20 కోట్ల వసూళ్లు సాధించి హాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్గా రికార్డును సృష్టించింది. గతంలో ఈ రికార్డు అవెంజర్స్ ఎండ్గేమ్(రూ.367) పేరిట ఉంది. తాజాగా ఈ రికార్డును అవతార్-2 బ్రేక్ చేసి అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఇదే జోరు కొనసాగితే రూ.400 కోట్ల మార్క్ను అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఈజీగా టచ్ చేస్తుందని పలువురు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక అవతార్-2 వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు 1.9 బిలియన్ డాలర్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. నిజానికి ఈ సినిమాకు వచ్చిన టాక్ చూసి అవతార్-2 ఫ్లాప్ అవుతుందని చాలా మంది భావించారు. కానీ టాక్తో సంబంధంలేకుండా ఈ రేంజ్లో కలెక్షన్లు సాధించిందంటే విశేషం అనే చెప్పాలి.