హైదరాబాద్: నటి చౌరాసియాపై దాడి కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. కేబీఆర్ పార్కులో వాకింగ్ చేయడానికి వచ్చిన ఆమెపై ఒక వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె మొబైల్ ఫోన్ను అతను లాక్కెళ్లాడు. ఈ కేసుపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
దుండగుడు నటి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు. చౌరాసియా కోసం ఆగంతకుడు వచ్చాడని పోలీసు అధికారులు తెలిపారు. నటిని పొదల్లోకి లాక్కెళ్లి పెదాలు, మెడపై సైకో గాయపరిచాడని వెల్లడించారు. ఆమెను బలవంతంగా పక్కకు లాక్కెళ్లే ప్రయత్నం చేసినట్లు తెలియజేశారు. నటి చౌరాసియాపై దాడి చేసింది ఒక సైకో అని పోలీసులు గుర్తించారు.