‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా అవతరించారు అగ్ర హీరో అల్లు అర్జున్. ఇక ‘జవాన్’ చిత్రంతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫాలోయింగ్ను సంపాదించుకున్నాడు తమిళ దర్శకుడు అట్లీ. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అభిమానులకు ఇక పండగే. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రెస్టిజీయస్ ప్రాజెక్ట్కు రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప-2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా అనంతరం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఇప్పటికే ఈ విషయమై ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని సమాచారం. అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నదని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.