శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూపు సమావేశాలు జరుగుతున్నాయి. ఆ ఈవెంట్లో పాల్గొనేందుకు ఫిల్మ్ స్టార్ రామ్ చరణ్ వెళ్లారు. అయితే అక్కడ వేదికపై జరిగిన ఓ కార్యక్రమంలో.. రామ్ తన నాటు నాటు(Naatu Naatu) స్టెప్పులతో అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీలోని ఈ చిత్రానికి ఈ ఏడాది ఉత్తమ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. నాటు నాటు ట్యూన్స్కు స్టేజ్పై ఉన్న అతిథులు కూడా రాంచరణ్తో కలిసి చిందేశారు.
#WATCH | J&K: Actor Ram Charan dances to the tunes of 'Naatu Naatu' song from RRR movie, in Srinagar. pic.twitter.com/9oZ8c9sYBY
— ANI (@ANI) May 22, 2023
కశ్మీర్ ఓ సుందరమైన ప్రదేశమని ఓ ఇంటర్వ్యూలో రాంచరణ్ తెలిపారు. 1986 నుంచి తన తండ్రితో కలిసి ఇక్కడకు వస్తున్నట్లు చెప్పారు. గుల్మార్గ్, సోనమార్గ్లో షూటింగ్లకు వెళ్లేవాడినన్నారు. 2016లో ఇదే ఆడిటోరియంలో ఓ షూటింగ్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఇదో మ్యూజిక్ ప్రదేశమని, కశ్మీర్కు రావడం ఓ అద్భమైన ఫీలింగ్ను ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ కశ్మీర్ అందాలకు ముగ్ధులు అవుతుంటారన్నారు.