అశ్విన్ బాబు, పాలక్ లల్వానీ జంటగా నటిస్తున్న సినిమా ‘వచ్చినవాడు గౌతం’. నాజర్, అచ్యుత్, ఆర్జే హేమంత్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై నిర్మాత డీఎస్ రావు నిర్మిస్తున్నారు. ఎం.ఆర్ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత డీఎస్ రావు మాట్లాడుతూ…‘మెడికో థ్రిల్లర్ చిత్రమిది. జనవరి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. హైదరాబాద్, విశాఖలో షెడ్యూల్స్ జరిపి వచ్చే మేలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, సంగీతం : హరి గౌర.