మహేష్బాబు మేనల్లుడు అశోక్గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువ దర్శకుడు ప్రశాంత్వర్మ కథనందించారు. ఈ సినిమాలో మిస్ ఇండియా మానస వారణాసి కథానాయికగా నటిస్తున్నది. గురువారం ఆమె ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె సత్యభామ పాత్రలో కనిపించనుంది. ‘రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది.సత్యభామగా మానస వారణాసి పాత్ర చక్కటి అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. కథాగమనంలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తాం’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, దర్శకత్వం: అర్జున్ జంధ్యాల.