Ashwini dutt about Shakti Collections | పుష్కర కాలం క్రితం వచ్చిన ‘శక్తి’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదుర్స్, బృందావనం వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ల తర్వాత ఈ సినిమా రావడంతో ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్లు.. మెహర్ రమేష్ స్పీచ్లు ఓ రేంజ్లో హైప్ తీసుకొచ్చాయి. ఇక అంతే హైప్తో థియేటర్కు వెళ్లిన ప్రేక్షకుడు.. బయటకు మాత్రం నీరసంతో వచ్చాడు. సాధారణ ప్రేక్షకులే కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా పేరెత్తితేనే బయపడిపోతుంటారు. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సెకండ్ లుక్ను ఫ్యాన్స్ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఇక బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కల గురించి నిర్మాత అశ్వినీదత్ ఓపెన్ అయ్యాడు. ఈ సినిమా వల్ల అశ్వినీదత్ ఏకంగా రూ.32 కోట్లు నష్టపోయాడట. ఈ సినిమా ఫలితం తనను తీవ్రంగా నిరాశపరిచిందని, ఈ సినిమా తర్వాత దాదాపు నాలుగేళ్ల వరకు మరో సినిమా చేయలేదని తెలిపాడు. ఇక అప్పట్లో ఈ సినిమా కోసం అశ్వినీదత్ రూ.48 కోట్లు ఖర్చు పెట్టాడు. తారక్ మార్కెట్కు అది రెండింతలు. ఇక దీనితో పాటుగా చిరంజీవి నటించిన చూడాలని ఉంది సినిమాను హిందీలో రిలీజ్ చేయడం వల్ల కూడా దాదాపు రూ.12 కోట్లు నష్టపోయానని తెలిపాడు.
ఇక ప్రస్తుతం అశ్వినీదత్ యంగ్ టాలెంట్తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తెగ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఆయన బ్యానర్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో ప్రాజెక్ట్-K ఒకటి. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.