ముంబై: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టయి, ఇటీవల బెయిలుపై విడుదలైన స్టార్ కిడ్ ఆర్యన్ ఖాన్ మరోసారి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ముందు హాజరయ్యాడు. ఇటీవల అతనికి బెయిలు మంజూరు చేసిన బాంబే హైకోర్టు.. ప్రతి శుక్రవారం ఎన్సీబీ విచారణకు హాజరవ్వాలని అతనికి షరతు విధించింది.
ఈ నేపథ్యంలోనే ఈరోజు (శుక్రవారం) ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ ఎదుట హాజరయ్యాడు. రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ముంబై నుంచి గోవా వెళ్తున్న ఒక నౌకపై ఎన్సీబీ అధికారులు అక్టోబరు నెల 2వ తేదీన రెయిడ్ చేశారు. అక్కడ ఆర్యన్తోపాటు అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా సహా పలువురు ప్రముఖులు కూడా దొరికిపోయారు.
అప్పటి నుంచి బెయిలు కోసం ప్రయత్నించగా అక్టోబరు 28న ఆర్యన్ సహా పలువురికి బెయిలు మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.