సినీ ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు అరవింద్స్వామి (Arvind Swamy). ఇటీవలే దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన తలైవి (Thalaivi )లో ఎంజీ రామచంద్రన్ పాత్రలో మెరిశాడు. ఎంజీఆరే (MGR) దిగొచ్చాడా అన్నట్టుగా ఆ పాత్రలో జీవించేశాడు అరవింద్ స్వామి. ఈ స్టార్ యాక్టర్ కు సంబంధించిన వార్త ఒకటి తెరపైకి వచ్చింది. 25 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత మలయాళ సినీ పరిశ్రమకు రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
అరవింద్ స్వామి తమిళం, మలయాళంలో భాషల్లో తెరకెక్కుతున్న ఒట్టు సినిమాతో మాలీవుడ్ (Mollywood) కు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఫెల్లిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు కుంచకో బోబన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమిళ నటుడు ఆర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. భారీ స్థాయిలో హై టెక్నికల్ వాల్యూస్ తో సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
2016లో రాంచరణ్ హీరోగా నటించిన ధృవ సినిమాతో విలన్ గా మళ్లీ తెలుగు సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళ ప్రాజెక్టులతో ప్రేక్షకులను వినోదాన్ని పంచుతున్నాడు.
Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Bheemla nayak: ఇక వరుస సర్ప్రైజ్లతో సందడి చేయనున్న రానా..!