చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్పై రాంచి సివిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అమీషా పటేల్ నిర్మాణ సంస్థ దేశీ మ్యూజిక్లో రాంచీ జిల్లాకు చెందిన అజయ్కుమార్ సింగ్ అనే వ్యక్తి పదేళ్ల క్రితం మూడుకోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఓ సినిమా నిర్మాణంతో పాటు ప్రచారానికి ఈ డబ్బుల్ని వినియోగించాలని ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే సినిమా మధ్యలోనే ఆగి పోయింది. దీంతో అజయ్కుమార్ డబ్బు వాపస్ ఇవ్వాలని కోరాడు. ఈ నేపథ్యంలో అమీషాపటేల్ ఇచ్చిన రెండు చెక్స్ బౌన్స్ కావడంతో అజయ్కుమార్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం అమీషా పటేల్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తెలుగులో ‘బద్రి’ ‘నాని’ చిత్రాలతో అమీషా గుర్తింపు పొందింది.