పర్యావరణ హితం కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు పెంచాలనే ఆలోచనను కలిగిస్తున్నారు. బుధవారం బిగ్ బాస్ పోటీదారు ఆరోహీ రావ్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో భాగంగా జుబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో మొక్కలు నాటారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ..‘బిగ్ బాస్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. స్వచ్ఛమైన ప్రాణవాయువు లభించాలంటే ప్రకృతిని కాపాడుకోవాలి. మొక్కలు నాటడం ద్వారానే అది సాధ్యం. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటాలి. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ గారికి కృతజ్ఞతలు.’ అని చెప్పింది.