‘పుష్ప’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు మలయాళ అగ్ర నటుడు ఫహాద్ ఫాజిల్. పోలీస్ ఆఫీసర్ బన్వర్సింగ్ షెకావత్ పాత్రలో ఆయన అందరికి గుర్తుండిపోయింది. ‘పుష్ప’ సీక్వెల్లో కూడా ఆయన పాత్ర కీలకంగా ఉండబోతున్నది. ఈ నేపథ్యంలో ఫహాద్ ఫాజిల్ తెలుగులో రెండు కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అగ్ర దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మిస్తున్న ‘ఆక్సిజన్’ ‘డోంట్ ట్రబుల్’ చిత్రాల్లో ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రలను పోషించనున్నారు.
అర్కా మీడియాతో కలిసి కార్తికేయ ఈ సినిమాలను తెరకెక్కించబోతున్నారు. స్నేహాం ప్రధానంగా రూపొందించన్ను ‘ఆక్సిజన్’ చిత్రం ద్వారా సిద్ధార్థ్ నాదేళ్ల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. థ్రిల్లింగ్ ఫాంటసీ కథాంశంతో తీయబోతున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకత్వం వహిస్తారు. ఈ రెండు కథలు వినగానే ఫహాద్ ఫాజిల్ వెంటనే అంగీకరించారని, ఆయన బహుముఖ ప్రజ్ఞకు ప్రతిరూపమని కార్తికేయ ప్రశంసించారు.