స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్గా మారిన అల్లు అర్జున తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా పక్క రాష్ట్రాలలోను ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా కూడా మారబోతున్నాడు. అయితే అల్లు అర్జున్కే కాదు ఆయన సతీమణి స్నేహా రెడ్డి, కొడుకు అయాన్, కూతురు అర్హలకు కూడా ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. వారికి సంబంధించి ఏదైన వార్త బయటకు వస్తే కొద్ది క్షణాలలో వైరల్ అవుతూ ఉంటుంది.
రీసెంట్గా అర్హ బిగ్ స్క్రీన్ ఎంట్రీకి టైం ఫిక్స్ అయిందనే ప్రచారం నడుస్తుంది. దిల్రాజు వంటి స్టార్ నిర్మాత సురేష్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా కథ చిన్న అమ్మాయి చుట్టూ సాగుతుందట. ఈ కథకు అల్లు అర్హా సెట్ అవుతుందని, అల్లు ఫ్యామిలీనీ ఒప్పించి అర్హను సినిమాలోకి తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. అర్హ.. అల వైకుంఠపురములోని ఓ మై డాడీ అనే ప్రమోషనల్ సాంగ్లో కనిపించి అలరించిన విషయం తెలిసిందే.