రామ్చరణ్ కథానాయకుడిగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. గ్రామీణ క్రీడా నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు రూపకల్పన చేస్తున్నారు. సెప్టెంబర్లో సెట్స్మీదకు వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందించబోతున్నారని తెలిసింది. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ కథ నచ్చడంతో రెహమాన్ ఈ ప్రాజెక్ట్కు ఓకే చేశారని అంటున్నారు. ‘కొమురం పులి’ తర్వాత రెహమన్ తెలుగు సినిమాకు పనిచేయలేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ ‘గేమ్చేంజర్’ చిత్రంలో నటిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశలో ఉంది. ఈ సినిమా పూర్తయిన అనంతరం బుచ్చిబాబు సానా చిత్రం పట్టాలెక్కనుంది.