సుజన్, తనీష్క్ జంటగా చలపతి పువ్వుల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అప్పుడు ఇప్పుడు’. ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాతలు. సెప్టెంబరు 3న చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇటీవల విడుదలైన టీజర్కు చక్కని స్పందన వస్తోంది. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పద్మనావ్ భరద్వాజ్.