స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న రాధేశ్యామ్ (Radhe Shyam)శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం (AP Govt) ప్రభాస్ టీంకు గుడ్ న్యూస్ అందించింది. రాధేశ్యామ్ టికెట్ ప్రీమియర్ ధర (AP Movie Ticket Prices)పై రూ.25 అదనంగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సినిమా బడ్జెట్ రూ.175 కోట్లుగా పేర్కొన్న చిత్ర నిర్మాణ సంస్థ జీఎస్టీ, ఇతర వివరాలను ఏపీ ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలుస్తోంది.
హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా సినిమా నిర్మాణానికి రూ. 100కోట్లకుపైగా ఖర్చు పెడితే టికెట్ ధర పెంచుకునే అవకాశం ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. యూనివర్సల్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.