జిల్లాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి!
ఇప్పటివరకు 6,280 మందికి మొదటి డోసు..3,377 మందికి రెండో డోసు పంపిణీ
అపోహలతో ఫ్రంట్లైన్ వారియర్స్,సామాన్య ప్రజానీకం టీకాకు దూరం
యాదాద్రి భువనగిరి, మార్చి19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కరోనా అంటే భయమొద్దు. అలాగని అల సత్వం పనికిరాదంటున్నారు వైద్య నిపుణులు. నిబ్బ రం కావాలి గానీ.. నిర్లక్ష్యం తగదని హెచ్చరిస్తున్నారు. మరణాల సంఖ్య తక్కువగా ఉండడమే కరోనా పట్ల భయం తగ్గడానికి ప్రధాన కారణమని నిపుణులు చెప్తు న్నారు. మరణాలు తక్కువన్న దృష్టితో.. తేలికగా తీసు కోవడం తగదని.. మొదట్నుంచి పాటిస్తున్న జాగ్రత్త లను విడువకుండా పాటించాలని వారు సూచిస్తున్నా రు. టీకా..తీసుకున్నాం. కదా.. ఇక మునుపటిలా ఎ క్క డికైనా వెళ్లొచ్చు అనుకుంటే పనిగట్టుకొని ముప్పు ను కొని తెచ్చుకున్నట్లేనని వారంటున్నారు. జాగ్రత్త పడకపోతే కుదుటపడిన పరిస్థితి దిగజారటం ఖాయ మని వైద్యులు ఘంటాపథంగా చెప్తున్నారు.’
వలసలతోనే.. పొంచి ఉన్న ముప్పు
యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. పక్కనే రాష్ట్ర రాజధాని ఉండడం.. నిత్యం అక్కడి నుంచి జిల్లాకు రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో కరోనా విషయంలో జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత మళ్లీ వ్యాపార, వాణిజ్య, ని ర్మాణ, పారిశ్రామిక రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ఈ తరుణంలో వెనక్కి వెళ్లిన వారం తా తిరిగి జిల్లాకు చేరుకుంటున్నారు. జిల్లాలో పనిచే స్తున్న ఉద్యోగుల్లో హైదరాబాద్ నుంచి రాకపోకలు సా గిస్తున్న వారే ఎక్కువ. దుబాయ్ నుంచి కొలనుపా కకు వచ్చిన ఇద్దరికీ.. హైదరాబాద్ నుంచి విధులకు హాజరైన ఓ ఉపాధ్యాయురాలికి పాజిటివ్ రావడం.. వంటి పరిస్థితులు వలసలతో పొంచి ఉన్న ముప్పును తేటతెల్లంజేస్తున్నాయి. రోజురోజుకూ కేసులు పెరుగు తున్న దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.
వ్యాక్సిన్ తీసుకున్నది 3,633 మంది మాత్రమే!
అందుబాటులోకి వచ్చిన కొవీషిల్డ్, కొవాక్సిన్ వ్యాక్సి న్ను తీసుకునేందుకు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు సైతం వెనుకడుగు వేస్తున్నారు. జిల్లాలో 4,831 మం ది హెల్త్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పటివరకు 2,829 మంది మాత్రమే టీకా వేసుకున్నారు. ప్రైవేట్ హెల్త్ వర్కర్లు 608 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని 194 మంది మాత్రమే టీకా వేసుకున్నారు. సెంట్రల్ హెల్త్ వర్కర్స్ 283 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని 143 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక ఫ్రంట్లైన్ వా రియర్స్ విషయానికొస్తే.. పోలీస్శాఖలో 878 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని 575 మంది వ్యాక్సిన్ తీసుకుం టే.. అర్బన్ మున్సిపాలిటీ ఉద్యోగులు, సిబ్బంది 575 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. ఇప్పటివరకు 90 మంది మాత్రమే టీకా తీసుకున్నారు. రెవెన్యూలో 902 మం దికి 208 మంది, పంచాయతీరాజ్ శాఖలో 2,548 మందికి 332 మంది మాత్రమే టీకా తీసుకున్నారు. 45-59 మధ్య వయస్సువారు మొదటి డోసును 54 7 మంది, రెండో డోసును 16 మంది తీసుకున్నారు. 60 ఏళ్లకు పైబడినవారు మొదటి డోసును 1,247 మంది తీసుకున్నారు. మొదటి డోసు తర్వాత రెండో డోసు తీసుకునేందుకు చాలామంది రావడం లేదు. ఇప్పటివరకు 6,280 మందికి మొదటి డోసు వ్యాక్సిన్ ఇవ్వగా.. 3,377 మంది రెండో డోసు తీసుకున్నారు.
వ్యాక్సిన్తో ప్రయోజనమే..
వ్యాక్సిన్తో అన్ని రకాలుగా ప్రయోజనమేనని వైద్య నిపుణులు చెప్తున్నారు. కొవిడ్ టీకా తీసుకుంటే.. కరో నా వైరస్కు వ్యతిరేకంగా శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. అవి వైరస్పై పోరాడి రక్షణగా ని లుస్తాయి. భవిష్యత్తులో కొవిడ్ సోకితే.. టి-కణాలు వైరస్పై సమర్థవంతంగా పోరాడతాయని.. కొవిడ్ టీకాను స్వీకరించడం వల్ల అన్ని విధాలా ప్రయోజ నాలే చేకూరుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు.. టీకా పొందని వ్యక్తి కొవిడ్ బారిన పడి దవాఖాన ఐసీయూలో 10 రోజులు తీవ్ర అస్వ స్థతతో చికిత్స పొందాల్సి వస్తే.. టీకా పొందిన వ్యక్తికి కొవిడ్ సోకినా.. అటువంటి తీవ్ర అస్వస్థతకు దారి తీ యదు. స్వల్ప లక్షణాలు, చికిత్సతోనే బయటపడే అవ కాశాలు ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు.
జలుబు, దగ్గు, జ్వరం వస్తే.. అశ్రద్ధ వద్దు
చలికాలం ముగిసి వేసవికాలం ప్రారంభం కావడం తో వైరల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. చాలా మంది జలుబు, దగ్గు, తుమ్ములు, జ్వరం, వంటి నొ ప్పులతో బాధ పడుతున్నారు. వాతావరణ మార్పుల తో వైరల్ వ్యాధులు సాధారణమే అయినప్పటికీ.. కరో నా చాపకింద నీరులా ఉండడంతో అశ్రద్ధ చేయవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొందరిలో జలుబు, తుమ్ములు వచ్చి మూడు, నాలుగు రోజులకు తగ్గిపో తున్నాయి. మరికొందరిలో ఒళ్లు నొప్పులు, జ్వరం, జలుబు, తలనొప్పి తదితర లక్షణాలు రోజుల తరబడి గా ఉంటున్నాయి. అయితే.. ఈ లక్షణాలతో పరీక్షలకు వస్తున్న కొందరిలో కొవిడ్ పాజిటివ్ కన్పిస్తోందని ద వాఖాన వర్గాలు చెబుతున్నాయి. కరోనా సెకండ్వేవ్ దృష్ట్యా నిర్లక్ష్యం పనికిరాదని వారు సూచిస్తున్నారు.