The Kerala Story2 | బాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరోసారి వార్తల్లో నిలిచాడు. గతేడాది వివాదాలతో సంచలనం సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్గా వస్తున్న ‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ సినిమాపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సినిమాను ఒక చెత్త ప్రాపగండా (Bullsh*t Propaganda) గా ఆయన అభివర్ణించారు. ఫిల్మ్ఫేర్ అవార్డుల కోసం కొచ్చి చేరుకున్న అనురాగ్ కశ్యప్ను మీడియా ప్రతినిధులు ఈ సినిమా వివాదంపై ప్రశ్నించగా ఆయన తనదైన శైలిలో స్పందించారు.
ఇదంతా కేవలం డబ్బు సంపాదించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ప్రజల మధ్య విభజన తీసుకువచ్చి లాభపడాలని చూస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. సినిమా ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలను ప్రస్తావిస్తూ.. అలా ఎవరైనా బీఫ్ తినిపిస్తారా? కనీసం కిచిడీని కూడా అలా తినిపించరు. ఇదంతా అబద్ధం అని కొట్టిపారేశాడు అనురాగ్. అలాగే దర్శక నిర్మాతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సినిమా మేకర్స్ అత్యాశపరులు. కేవలం డబ్బు కోసమే ఇలాంటి కథలు తీస్తున్నారు అని ఘాటుగా విమర్శించారు.
మరోవైపు ఈ సినిమా సర్టిఫికేషన్పై కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమా టీజర్ మరియు ట్రైలర్లలో ఉన్న అంశాలు సమాజంలో విద్వేషాన్ని పెంచేలా ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. సినిమాలో చూపించిన కొన్ని నినాదాలు (ముఖ్యంగా ‘అబ్ సహేంగే నహీ.. లడెంగే’) ప్రతికార చర్యలను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి.
Proper review of #KeralaStory in few words by @anuragkashyap72 pic.twitter.com/RoTXkMjBkv
— Comrade From Kerala 🌹 (@ComradeMallu) February 21, 2026