Nishaanchi | బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘నిశాంఛి’ (Nishaanchi). అమెజాన్ MGM స్టూడియోస్ ఇండియా సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని జార్ పిక్చర్స్ బ్యానర్పై అజయ్ రాయ్, రంజన్ సింగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఆయిశ్వర్య్ థాకరే (Aaishvary Thackeray) హీరోగా బాలీవుడ్కి పరిచయం అవుతుండగా, వేదిక పింటో(Vedika Pinto), మోనికా పన్వార్(Monika Panwar), మహమ్మద్ జీషన్ అయ్యూబ్ (Mohammed Zeeshan Ayyub), కుముద్ మిశ్రా(Kumud Mishra) కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 19, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. గ్యాంగ్స్టర్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది.