Anupama Parameswaran | మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే రీసెంట్గా ఈగల్ సినిమాలో మెరిసిన ఈ భామ టిల్లు 2తో సందడి చేయనుంది. అయితే అనుపమ తాజాగా ఒక తమిళ సినిమా ఓకే చేసింది. గతేడాది మామన్నన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతుంది. ఇక ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు.
స్పోర్ట్స్ డ్రామాలో ఈ సినిమా రాబోతుండగా.. అప్లాస్ ఎంటర్టైన్మెంట్స్, నీలం స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాయి. స్పోర్ట్స్ డ్రామాలో మొదటిసారి అనుపమ నటిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమాని కేవలం తమిళ్ లోనే రిలీజ్ చేస్తారా? లేక తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా చూడాలి.