మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్కు నటనతో పాటు సంగీతంపై కూడా మంచి పట్టుంది. ఆమె గాత్రం బాగుంటుందని అభిమానులు ప్రశంసిస్తుంటారు. సోషల్మీడియాలో కొన్నిసార్లు తనకు ఇష్టమైన పాటల వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన గాన కౌశలాన్ని ప్రదర్శించింది.
తమిళ చిత్రం ‘మౌనం సమ్మదమ్’లో ఇళయరాజా స్వరపరచిన ఓ పాటను పాడి ఆ వీడియోను షేర్ చేసింది. చక్కటి స్వరంతో ఆమె పాటను ఆలపించిన విధానానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. అద్భుతమైన గొంతు అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. సినిమాల్లో పాడితే చూడాలని ఉందంటూ కొందరు అభిమానులు కోరారు. ప్రస్తుతం ఈ భామ తెలుగులో టిల్లు స్కేర్, ఈగిల్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది