‘భీమవరం యువకుడి కథ ఇది. కోడిపందాల ద్వారా జూదం ఆడుతూ సరదాగా జీవితాన్ని గడిపే అతడికి ఎదురైన సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’ అన్నారు శ్రీను గవిరెడ్డి. ఆయన దర్శకత్వంలో రాజ్తరుణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అనుభవించు రాజా’. సుప్రియ యార్లగడ్డ నిర్మాత. ఈ నెల 26న విడుదలకానుంది. ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ‘చిన్న సినిమాలు ఇండస్ట్రీని కాపాడుతాయి. రెండున్నర గంటలు ప్రేక్షకులకు సంపూర్ణ వినోదాన్ని పంచే చిత్రమిది. రాజ్తరుణ్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది’ అని చెప్పారు. అన్నపూర్ణ స్టూడియో సంస్థలో తనకిది మూడో చిత్రమని..కుటుంబమంతా కలిసి చూసి నవ్వుకునేలా ఉంటుందని హీరో రాజ్తరుణ్ తెలిపారు. కశిష్ఖాన్, పోసానికృష్ణమురళి, ఆడుకాలమ్ నరేన్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నాగేష్ బానెల్, సంగీతం: గోపీసుందర్, నిర్మాణ సంస్థలు: అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రచన-దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి.