రాజ్ భీమ్రెడ్డి, జారా ఖాన్, చమ్మక్చంద్ర, సమీర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జయహో ఇండియన్స్’. ఆర్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. రాజ్ భీమ్రెడ్డి నిర్మాత. మతం పేరుతో జరుగుతున్న మారణకాండలో బలయ్యేదెవరు? నాయకులా? అమాయకులా? లేక దేశమా? అనే అంశాల్ని చర్చిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని వీడియోసాంగ్ను విడుదల చేశారు. “జయహో ఇండియన్స్’ ఆంథమ్ ఇది. చక్కటి సాహిత్యంతో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జైపాల్రెడ్డి నిమ్మల, సంగీతం: సురేష్ బొబ్బిలి, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: ఆర్.రాజశేఖర్ రెడ్డి.