టాలీవుడ్లోకి మరో ఓటీటీ రాబోతున్నది. మలేషియాలో పేరు తెచ్చుకున్న ‘సన్షైన్ ఓటీటీ’ త్వరలో ఇక్కడా ప్రారంభం కాబోతున్నది. టీఎఫ్సీసీతో ఈ ఓటీటీ టైఅప్ అవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో సన్షైన్ ఓటీటీ సీఎండీ బొల్లు నాగ శివప్రసాద్ మాట్లాడుతూ…‘మిగతా ఓటీటీలతో పోల్చితే కంటెంట్లో తగ్గకుండా మా ఓటీటీని తీసుకొస్తున్నాం. మా దగ్గర వెయ్యి చిత్రాల బ్యాంకింగ్ ఉంది. అలాగే ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేశాం.
యువ ప్రతిభావంతుల కోసం షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కూడా నిర్వహించబోతున్నాం’ అన్నారు. టీఎఫ్సీసీ ఛైర్మన్ ఆర్కే గౌడ్ మాట్లాడుతూ..‘సన్షైన్ ఓటీటీ మాతో భాగస్వామి కావడం సంతోషంగా ఉంది. ఈ ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలింస్ తీసుకొస్తాం’ అన్నారు.