తెలుగు తెరపైకి మరో బాలీవుడ్ నటుడు విలన్గా రాబోతున్నారు. ఇప్పటికే వివేక్ ఒబెరాయ్ లాంటి నటులు రామ్ చరణ్కు ప్రతినాయకుడిగా ఢీకొనగా..ఇప్పుడు సైఫ్ అలీఖాన్ టాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నారు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో సైఫ్ ప్రతినాయకుడిగా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తున్నది. సైఫ్ అలీఖాన్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆది పురుష్’ చిత్రంలో రావణుడి పాత్రలో నటిస్తున్నారు.
మహేష్ నటిస్తున్న 28వ చిత్రమిది. ఇప్పటికే ఒక షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకున్నారు. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నది. హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల కానుంది. మహేష్ బాబు కెరీర్లో తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న చిత్రమిది.