అంకిత జాదవ్, రోహిత్ భోగ జంటగా సత్య మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందిన పాటలు ‘నువ్వే ఉండిపో ఇలా’, ‘నువ్వేలే’. ఈ పాటలకు కె.కె.రెడ్డి నిర్మాత. రాంబాబు గోసాల రాసిన పాటలను జయంత్ ఆర్యన్ స్వరపరచగా లిప్సిక, అదితి భావరాజు పాడారు. ఈ పాటల రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. దర్శకులు సాయిరాజేష్, శైలేష్ కొలను, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, అషురెడ్డి అతిథులుగా విచ్చేసి శుభాకాంక్షలు అందించారు. తక్కువమంది క్రూతో ఈ పాటలు చిత్రీకరించామని, నిర్మాత కె.కె.రెడ్డి ఇష్టంతో ప్రొడ్యూస్ చేశారని సత్య మాస్టర్ తెలిపారు. యువతను ఈ పాటలు ఆకట్టుకుంటాయని నిర్మాత కె.కె.రెడ్డి నమ్మకంగా చెప్పారు.