Sandeep Reddy Vanga | రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా అపూర్వ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు దర్శకుడు సందీప్రెడ్డి వంగా. ఈ నేపథ్యంలో ఆయన అగ్ర నటులు చిరంజీవి, షారుఖ్ఖాన్లతో సినిమాలు చేయా లనుందనే అభిలాషను వ్యక్తం చేశారు.
‘అర్జున్ రెడ్డి’ ‘యానిమల్’, ‘కబీర్ సింగ్’ సినిమాల ద్వారా తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్న సందీప్రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవితో భవిష్యత్తులో సినిమాలు చేసే ఆలోచన ఉందని తెలిపారు. త్వరలో ఆయన ప్రభాస్తో ‘స్పిరిట్’ సినిమాకు సన్నద్ధమవుతున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ సినిమా చేయనున్నారు.