బిగ్ బాస్ 11వ వారం కొరియోగ్రాఫర్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆమె ఎలిమినేట్ కావడంతో హౌజ్లో కేవలం ఎనిమిది మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరిలో టాప్ 5లో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా అనీ, ప్రియాంకలను గార్డెన్ ఏరియాకి రమ్మన్నాడు నాగ్. చివరకు అనీ మాస్టర్ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించాడు.
బయటకు వచ్చిన అనీ ఒక్కొక్కరి గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది. మొదటి నుంచి ఇప్పటి వరకు నన్ను మోటివేట్ చేస్తూనే ఉన్నాడు.. ఇంట్లో అందరినీ అలానే మోటివేట్ చేయాలి.. టాప్ 3లో ఉండాలని రవి గురించి చెప్పింది. శ్రీరామచంద్ర కూడా నాలానే. నీ కోసం ఉన్నానంటూ చెప్పడు. కానీ నాకు అవసరం ఉన్నప్పుడల్లా నాతోనే ఉన్నాడు. నా సొంత సోదరుడు. ఆయనెప్పుడూ కరెక్ట్గానే ఉన్నాడు.. అలానే ఉండు అని శ్రీరాచంద్ర గురించి చెప్పింది.
ఫణ్ముఖ్ నిజాయితీగా మాట్లాడతాడు. పక్షపాత ధోరణి చూపించడు. సిరి పటాక టాస్కులు బాగా ఆడుతుంది.. ప్రియాంక బట్టర్ ఫ్లై .. నీ గేమ్ నువ్ ఆడు.. ఆడుతున్నావ్ అని తెలుసు.. ఇన్ని రోజులు ఇలాంటివి జరగలేదు. కానీ చివర్లోనే జరిగాయి..మనుషులం కదా? అవుతుంటాయ్ అని ఆనీ మాస్టర్ అంది. మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి మాస్టర్ అని ప్రియాంక ఎమోషనల్ అయింది. కాజల్ గురించి చెప్పడానికేం లేదు.. టాప్ 8లో ఉన్నందుకు కంగ్రాట్స్ అని అంది. బయటకు వచ్చాక మనం మంచి ఫ్రెండ్స్ అవుదామని మానస్కు చెప్పింది. మొదట ఫ్రెండ్ అయింది సన్నీనే అని చెబుతూ వీడ్కోలు పలికింది.
చివరలో మానస్కి లెటర్ రాగా, దానిని నాగ్ చదివి వినిపించాడు. మొన్నటివరకు బాగా ఆడారు. కానీ ఈ మధ్య పింకీతో కలిసి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకు? అని అతడు ప్రశ్నించాడు. దీనికి మొదట షాకైన మానస్ కాసేపటికే తేరుకుని పింకీతో తనకు బాండ్ ఏర్పడిందన్నాడు. ఇది కంటెంట్ ఇవ్వడం కాదని క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాడు.