ప్రముఖ వ్యాఖ్యాత, బుల్లితెర ప్రయోక్త సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బలగ ప్రకాష్ నిర్మాత. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న విడుదల చేయబోతున్నారు. ‘గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రమిది. ఇందులో సుమ ఊరి పెద్ద జయమ్మ పాత్రలో కనిపిస్తుంది. ఎవరికి భయపడని, కాస్త స్వార్థపరురాలైన మహిళగా ఆమె పాత్ర శక్తివంతంగా సాగుతుంది. ఆమె పంచాయితీ నిర్వహించి తీర్పు చెప్పిందంటే ఇక తిరుగుండదు. ఇటీవల విడుదలైన టీజర్, పాటలకు మంచి ఆదరణ లభిస్తున్నది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథాంశమిది’ అని చిత్రబృందం తెలిపింది. దేవీప్రసాద్, దినేష్, షాలినీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అనుష్కుమార్, సంగీతం: కీరవాణి, నిర్మాణ సంస్థ: వెన్నెల క్రియేషన్స్, కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు, దర్శకత్వం: విజయ్ కుమార్
కలివారపు.