బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్గా ఆరువారాలు పూర్తి చేసుకుంది. శనివారం రోజు లోబోని సీక్రెట్ రూంకి పంపగా, ఆయన ఎలిమినేట్ అయ్యాడేమోనని భావించిన కొందరు సభ్యులు చాలా ఎమోషనల్ అయ్యారు.రవి, విశ్వ, మానస్లు స్మోకింగ్ ఏరియాలో ముచ్చట్లు పెట్టేశారు. రవి ఎమోషనల్ అవుతుంటే మానస్, విశ్వ ఓదార్చారు. ఆ సమయంలోనే రవి తనకు లోబోకు ఉన్న స్నేహం గురించి చెప్పాడు.
లోబో తండ్రి చనిపోయినప్పుడు మేమిద్దరం ఒకే చోటు ఉన్నాం. విషయం తెలియగానే ఉరుక్కుంటూ వెళ్లాం. లోబో తండ్రి రోడ్డు మీద అలా నడుచుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయాడు. వాడి తండ్రి చనిపోయిన సమయంలో మూడు రోజులు వాడితోనే ఉన్నాను.. అది మా కనెక్షన్ అంటూ రవి ఎమోషనల్ అయ్యాడు. అనంతరం నాగార్జున స్టైలిష్ ఎంట్రీ ఇచ్చి ఇంటి సభ్యులకు హాయ చెప్పాడు. సండే కావడంతో ఫన్ డేగా మార్చేశాడు.
ఇంటి సభ్యులను రెండు టీంలుగా విడగొట్టాడు. పిప్పిప్పీ అని ఊదుకుంటూ పాటలను గెస్ చేేసే ఆటను పెట్టేశాడు. ఇందులో టీం ఏ సభ్యులుగా సరి, షన్ను, కాజల్, శ్రీరామ, ప్రియాంక, విశ్వలను ఫిక్స్ చేశాడు. రవిని సంచాలక్గా నియమించాడు. మిగిలిన వారందరినీ టీం బీ సభ్యులుగా ఉన్నారు. ఈ గేమ్లో టీమ్ ఏ గెలుపొందింది. ఇక ఆట ముగిసే సమయానికి ప్రియాంక, షన్నులు సేఫ్ అయినట్టు ప్రకటించాడు. అనంతరం పిగ్గీ బ్యాంకులను పగలగొట్టడంతో శ్రీరామ్, సన్నీలు సేఫ్ అయినట్టు తెలియజేశాడు.