Rashmi Gautam Emotional Note on Instagram | బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ రష్మీ గౌతమ్. నటిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్గా మారి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా రష్మీ ఇంట్లో విషాదం నెలకొంది. రష్మీ గ్రాండ్ మదర్ శుక్రవారం కన్నుమూసింది. ఈ విషయాన్ని ఇన్స్టాలో తనే స్వయంగా చెప్తూ భావోద్వేగపూరిత నోట్ను స్టోరీలో పెట్టింది.
‘మా గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా ఈ రోజు కన్నుమూశారు. ఆమె మరణంతో కుటుంబ సభ్యులమంతా శోకసంద్రంలో మునిగిపోయారు. బరువెక్కిన గుండెలతో ఆమెకు వీడ్కోలు పలికాం. తను చాలా స్ట్రాంగ్ మహిళ. మా అందరిపై ఆమె ప్రభావం ఉంటుంది. మా నుంచి దూరమైనా.. ఆమె అందమైన జ్ణాపకాలు మాలో సంజీవంగా ఉన్నాయి. ఓం శాంతి’ అంటూ ఎమోషనల్ అయింది. దీనిపై పలువురు బుల్లితెర నటీనటులు రష్మీకకు స్టే స్ట్రాంగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘హోలి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రష్మీ గౌతమ్. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ నటిగా పనిచేసింది. ఈ క్రమంలోనే ‘కండెన్’ అనే తమిళ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. సినిమా కూడా తమిళ్ సూపర్ హిట్టయింది. కానీ అవకాశాలు మాత్రం కొదువయ్యాయి. ఆ తర్వాత ‘గురు’, ‘లాగిన్’ వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించినా ఆమె కెరీర్కు పెద్దగా ప్లస్ కాలేకపోయాయి. ఆ తర్వాత ‘గుంటూర్ టాకీస్’లో తెలుగులో మేయిన్ లీడ్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో రష్మీ పాత్ర బోల్డ్గా ఉండటంతో ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వచ్చాయి. ప్రస్తుతం ఆమె చిరంజీవి ‘భోళాశంకర్’ సినిమాలో నటిస్తుంది. వెండితెర సంగతి పక్కన పెడితే బుల్లితెరపై మాత్రం మంచి జోరు చూపించింది. ‘జబర్దస్థ్’, ‘ఢీ జోడీ’ వంటి షోలతో బుల్లితెరపై దూసుకుపోతుంది.