Anasuya- Rashmi | బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ప్రేక్షకులకి ఎంత మంచి వినోదం అందించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడీయన్స్ లైమ్ లైట్లోకి వచ్చారు. కొంత మంది సినిమాలలోకి వెళ్లి కూడా సత్తా చాటుతున్నారు. అయితే జబర్దస్త్ షో అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లలో అనసూయ, రష్మీ తప్పక ఉంటారు. ఒకప్పుడు ఈ ఇద్దరూ జబర్దస్త్కు యాంకర్లుగా నిలిచారు. అయితే అనసూయ సినిమాలపై ఫోకస్ పెంచడంతో షో నుంచి తప్పుకోగా, రష్మీ మాత్రం ఇప్పటికీ యాంకర్గా కొనసాగుతోంది. జబర్ధస్త్ కామెడీ షో 12 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా గ్రాండ్ సెలబ్రేషన్ ప్లాన్ చేసారు నిర్వాహకులు.
ఈ వేడుకకు పాత జబర్దస్త్ టీమ్ మొత్తాన్ని ఆహ్వానించగా అనసూయ కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో అనసూయ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. ప్రోమోలో అనసూయ మాట్లాడుతూ, “జీవితం బోలెడన్ని అవకాశాలు ఇవ్వదని అంటారు కానీ తప్పకుండా ఇస్తుందిష అని భావోద్వేగంతో చెప్పింది. అంతేకాదు, రష్మీ దగ్గరకు వెళ్లి హత్తుకోవడంతో ఆమె కంటతడి పెట్టుకుంది. కొంతమందితో ప్యాచప్ కావాలి అనిపిస్తోందని అని చెప్పిన అనసూయ.. ఈ ప్యాచప్ వల్ల కొన్నివిషయాలు అందరికీ తెలిసిపోయేలా ఉన్నాయి . దీనికి రష్మీ.. అదేదో వాట్సాప్ లో గాని ఫోన్ చేసి గాని మాట్లాడి ఉంటే అయిపోయేది కదా అంటే అలా అయితే చాలా ఇగోలు అడ్డు వస్తాయి అని అనసూయ తెలిపింది.
ఇది చూసి వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా సంబంధాలు సరిగా లేవని స్పష్టమవుతోంది. విభేదాల కారణంగా మాట్లాడుకోవడం లేదా, లేక పనుల ఒత్తిడితో ఈ గ్యాప్ వచ్చిందా అన్నది పూర్తి ఎపిసోడ్లో తెలిసే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక ఎపిసోడ్ను ఆగస్టు 8, 9 తేదీల్లో రాత్రి 9:30కి ఈటీవీలో ప్రసారం చేయనున్నారు. అందుకే జబర్దస్త్ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్కి నాగబాబు హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణ. పాత కమెడీయన్స్తో నాగబాబు చేసిన సందడి కూడా ఓ రేంజ్లో ఉంది.