సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకుడు. శివశంకర్ పైడిపాటి నిర్మాత. ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్ను ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘టైటిల్ లుక్ వినూత్నంగా ఉంది. కొత్తదనాన్ని నమ్మి చిత్రబృందం చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించాలి’ అని తెలిపారు. ‘కల్పిత అంశాలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. సునీల్, అనసూయ పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నాం. హైదరాబాద్, భీమవరం, మచిలీపట్నంలలో షూటింగ్ జరుపుతాం’ అని దర్శకుడు పేర్కొన్నారు. అక్సాఖాన్, షమ్ము, షకలకశంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాప్ రాక్ షకీల్, కెమెరా: దర్శన్.