Anasuya Bharadwaj | యాంకర్ అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ షోతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఈ మధ్య కాలంలో సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా మారిపోయింది. క్షణం, రంగస్థలం, పుష్ప ది రైజ్ వంటి సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తూ వెండితెర ప్రేక్షకులకు దగ్గరవుతుంది. ప్రస్తుతం ఈమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయితే అనసూయ మాత్రం నటన ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటుందట. లేటెస్ట్గా విడుదలైన పక్కా కమర్షియల్ సినిమాలోనూ అనసూయ నటించంది . కాగా తాజాగా అనసూయ ఛాలెంజింగ్ పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో సమాచారం.
అనసూయ ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ స్క్రిప్ట్ అందిస్తున్న కన్యాశుల్కం వెబ్సిరీస్లో నటిస్తుంది. ఈ వెబ్సిరీస్లో అనసూయ వేశ్యగా నటించనుందట. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం ఆధారంగా క్రిష్ కథను సిద్ధం చేశాడట. ఇందులో మధురవాణి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించనుందట. ఇప్పటివరకు ఈమె చేసిన పాత్రల కంటే ఈ పాత్ర ఛాలెంజింగ్గా ఉండనుందట. ప్రస్తుతం అనసూయకు తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్ర సీమల నుండి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ స్టార్ యాంకర్ బుల్లితెర షోల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తుంది.