శివబాలాజీ, ధర్మ బ్రిగిడ సాగ ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘సింధూరం’. శ్యామ్ తుమ్మలపల్లి దర్శకుడు. ప్రవీణ్ రెడ్డి జంగా నిర్మాత. ఈ చిత్రంలోని ‘ఆనందమో.. ఆవేశమో’ అనే లిరికల్ వీడియోను దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘బాలాజీ సాహిత్యం అందించిన ఈ పాటను అభయ్ జోద్పూర్కర్ ఆలపించారు. పాటకు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా చిత్రం జనాదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.