మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం, మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రతో కలిసి నాటు నాటు స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హైదరాబాద్ వేదికగా నేడు వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా – ఈ రేసు జరుగగా.. సాగరతీరాన నిర్వహించిన ఈ రేసు విజయవంతంగా ముగిసింది. ఈ రేసు అనంతరం మహీంద్రా రేసింగ్ టీమ్ యాజమాని ఆనంద్ మహీంద్ర, రామ్ చరణ్తో కలిసి నాటు నాటు స్టెప్పులు వేసి అలరించారు. ”హైదరాబాద్ ఫార్ములా – ఈ రేసుకు వెళ్లడం వల్ల.. రేసుతో పాటు బోనస్గా రామ్ చరణ్ దగ్గర నాటు నాటు స్టెప్ నేర్చుకున్నాను. థ్యాంక్యూ రామ్ చరణ్ ఆస్కార్ కోసం గుడ్ లక్” అని మహీంద్ర ట్విట్టర్లో రాసుకొచ్చారు.
ఈ రేసులో జీన్ ఎరిక్ విన్నర్గా నిలువగా. రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు. అయితే ఈ రేసులో భారత్ కు చెందిన మహీంద్రా, జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ టీమ్లు కూడా పాల్గొన్నాయి. మహీంద్రా రేసింగ్ టీమ్కు చెందిన ఒలివర్ రోలాండ్ 6వ స్థానంలో నిలవగా, అదే జట్టుకు చెందిన లూకాస్ డి గ్రాస్సి 14వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఈ రేసింగ్ను చూసేందుకు సినీ, క్రీడా ప్రముఖులు తరలివచ్చారు. క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధవన్, చాహల్, దీపక్ చాహర్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున, రామ్చరణ్, నాగచైతన్య, అఖిల్, నవదీప్, సిద్దు జొన్నలగడ్డ, కేజీఎఫ్ హీరో యష్ హాజరయ్యారు.
Well apart from the race, one real bonus at the #HyderabadEPrix was getting lessons from @AlwaysRamCharan on the basic #NaatuNaatu steps. Thank you and good luck at the Oscars, my friend! pic.twitter.com/YUWTcCvCdw
— anand mahindra (@anandmahindra) February 11, 2023